తెలంగాణ పదోతరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల !

తెలుగు న్యూస్ టుడే ➤ తెలంగాణ రాష్ట్ర పదోతరగతి వార్షిక పరీక్షల ఫీజు షెడ్యూల్ ను విడుదల చేసింది రాష్ట్ర విద్యాశాఖ. 125రూపాలయల పరీక్ష ఫీజును అక్టోబర్ 29 లోగా చెల్లించాలని సూచించింది. రూ.50 లేట్ ఫీజుతో నవంబర్ 12 వరకు.. రూ.200 ఆలస్యపు ఫీజుతో నవంబర్ 26 వరకు, రూ.500 లేట్ ఫీజుతో డిసెంబర్ 10 వరకు చెల్లించే అవకాశముందని తెలిపింది విద్యాశాఖ.
గతేడాది మూడు సబ్జెక్టులు ఫెయిలైన వారు అదనంగా రూ.110 చెల్లించాలని..మూడు కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయితే అదనంగా రూ.125 చెల్లించాలని చెప్పింది.

Leave a Comment