కృష్ణా జిల్లాలో ఈ నెల 17 నుంచీ 23 వరకు ఎల్‌ఎల్‌ఆర్‌ మేళా !

తెలుగు న్యూస్ టుడే ➤ కృష్ణా జిల్లా రవాణాశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ఈనెల 23 వరకు ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాలు నిర్వహించనున్నారు. రోజుకు రెండు గ్రామాల చొప్పున 15 గ్రామాల్లో లెర్నింగ్‌ లైసెన్స్‌లు జారీ చేసేందుకు మేళాలు నిర్వహిస్తున్నట్లు కృష్ణాజిల్లా డెప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ ఇ.మీరాప్రసాద్‌ తెలిపారు. స్పాట్‌లో ఎల్‌ఎల్‌ఆర్‌ స్లాట్‌లు బుక్‌ చేసేందుకు రవాణా శాఖ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

17న పెనమలూరు మండలం యనమలకుదురు, విజయవాడలోని రామకృష్ణాపురం, 18న కంకిపాడు మండలం తెన్నేరు, మంతెన, 19న జి.కొండూరు మండలం కవులూరు, 20న గన్నవరం, పెనమలూరు, 21న జి.కొండూరు మండలం వెలగలేరు, విజయవాడ రూరల్‌ మండలం నున్న, 22న గణపవరం, పెనమలూరు మండలం గోసాల, 23న విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడి, జి.కొండూరు మండలం వెల్లటూరులో ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాలు నిర్వహిస్తారు.

Leave a Comment