ఆంధ్రాలో ఇకపై ఒకే రాష్ట్రం….ఒకే కోడ్

తెలుగు న్యూస్ టుడే ➤ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాలో ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలయింది . రవాణా వ్యవస్థలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పు తీసుకువచ్చింది. ఇక నుంచి ఒకే రాష్ట్రం….ఒకే కోడ్ విధానం అమలులోకి రానుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చామని రవాణా మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఇక నుంచి రాష్ట్రంలో వాహనాలకు ఒకే కోడ్ ఉంటుందని, జిల్లాలకు ప్రత్యేక కోడ్ ఉండదని స్పష్టం చేశారు. ఈ విధానంతో పాత వాహనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన పేర్కొన్నారు. ఇక నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకునే వాహనాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కోడ్ ఉంటుందన్నారు. ఏపీ 39 నంబర్‌తో ఏపీలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ఉంటుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

ఈ కొత్త విధానంతో రెండున్నర రోజుల్లోనే అంకెల సిరీస్‌ మారిపోతుందని రవాణా శాఖ కమిషనర్‌ బాలసుబ్రమణ్యం చెప్పారు. దీనివల్ల నెలలోనే 15సార్లు కొత్త సిరీస్‌ అంకెలు వస్తాయన్నారు. ఏపీ 39తో కొత్త సిరీస్‌ ప్రారంభిస్తామని, 15 రోజుల్లో ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు.

Leave a Comment