నెల్లూరు దర్గాని సందర్శించిన పవన్ కళ్యాణ్ !

తెలుగు న్యూస్ టుడే ➤ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ సందర్బంగా బారాషహీద్‌ దర్గాను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా దర్గాలోని బారాషహీద్‌లను ఆయన దర్శించుకున్నారు. అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాక్షింస్తూ.. పవన్‌ స్వర్ణాల చెరువులో రొట్టెను పట్టుకున్నారు. కార్యక్రమంలో హాస్యనటుడు అలీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పనిచేసేవారికే కానీ, పార్టీ జెండాలు మోస్తే నాయకులు కాలేరని, ఇటువంటి వారికి జనసేన పార్టీలో గుర్తింపు ఉండదని పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. రొట్టెల పండుగ సందర్భంగా ఆదివారం నెల్లూరు వచ్చిన పవన్‌ మాగుంట లేఔట్‌లోని ఓ హోటల్‌లో జనసేన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు.

Leave a Comment