హైద్రాబాద్ రెండో టెస్ట్‌ టీమిండియా గెలుపు !

తెలుగున్యూస్ టుడే ➤ హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో మూడు రోజులుగా జరుగుతున్నటీమిండియా వెస్ వెస్టిండీస్‌ రెండో టెస్ట్‌ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగించి 72 పరుగులు లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా ఛేదించి రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో ఎగరేసుకుపోయింది.

సొంతగడ్డపై కోహ్లి సేనకు ఇది వరుసగా పదో టెస్ట్ విజయం కావడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో 367 పరుగులు చేసి 56 రన్స్ లీడ్ సాధించిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ను కేవలం 127 పరుగులకే కట్టడి చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన ఉమేష్ యాదవ్.. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. టెస్ట్ కెరీర్‌లో పది వికెట్లు తీయడం ఉమేష్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. జడేజా 3, అశ్విన్ 2 వికెట్లు తీశారు. తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు పృథ్వీ షా, కేఎల్ రాహుల్ సునాయాస విజయం సాధించి పెట్టారు. పృథ్వీ 33, రాహుల్ 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 272 పరుగులతో భారత క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయం సాధించిన కోహ్లి సేన.. రెండో టెస్ట్‌లో 10 వికెట్లతో గెలవడం విశేషం. ఈ రెండు టెస్ట్‌ల సిరీస్‌లో ఓపెన‌ర్ పృథ్వీ షా మొత్తం 237 ప‌రుగులు చేశాడు. తొలి టెస్ట్‌లోనే ఆడిన ఒక ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసిన పృథ్వీ.. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 70, రెండో ఇన్నింగ్స్‌లో 33 ప‌రుగులు చేశాడు. ఉమేష్ యాద‌వ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌, పృథ్వీ షాకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ద‌క్కాయి.

Leave a Comment